YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోలీసులు కొట్టారంటూ బిఆర్ఎస్ నాయకులు ధర్నా

పోలీసులు కొట్టారంటూ బిఆర్ఎస్ నాయకులు ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఓ గిరిజనుడిని పోలీసులు చితకబాదారంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.మండలంలోని ఆనంతారం గ్రామం లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ తో రావడం గమనించిన నవీన్ అనే ఓటర్ మొబైల్ తో ఎలా అనుమతిస్తున్నారంటూ పోలీసులని అడగగా గమనించిన పోలీసులు సదరు వ్యక్తి నుంచి మొబైల్ తీసుకుని లోపల పంపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఓటర్ ని బెదిరిస్తూ నీ సంగతి చూస్తానంటూ బెదిరించాడని,ఈరోజు ఉదయం పోలీసులు మాట్లాడే పని ఉందంటూ స్టేషన్ కు పిలిచి చితకబాదారని, కేసు కూడా ఫైల్ చేయకుండా నాపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ నవీన్ ఆవేదన చెందుతున్నాడు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి ఘటనలు జరగలేదని, తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని,బాధితులకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts