YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేతల ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది

వైసీపీ నేతల ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది

విజయవాడ
జగన్ రెడ్డి గూండా రాజ్ పాలన మాకొద్దని ప్రజలంతా స్పష్టమైన మేన్డేట్ ఇచ్చారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో కనీసం తమకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదు. ఆ భయం, ఫ్రస్టేషన్తో వైసీపీ నాయకులు గంజాయి బ్యాచ్ తో రాష్ట్రమంతా పేట్రేగిపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నయుడు అన్నారు.  పల్నాడులో పిన్నెళ్లి సోదరుల అరాచకాలకు ఏకంగా 144 సెక్షన్ విధించాల్సిన దుస్థితి ఏర్పడింది. భారీగా పోలీసుల్ని మొహరించి పిన్నెళ్లి రౌడీల నుండి ప్రజల్ని కాపాడుకోవాల్సి వస్తోంది. వందలాది మంది రౌడీలు రాళ్లు, రాడ్లు, కత్తులు పట్టుకుని వీరంగం సృష్టిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది. జగన్ రెడ్డి అరాచకానికి ఇంకెంత మంది పేదల్ని బలితీసుకుంటారు? మరోవైపు ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ అనుచరులపై వైసీపీ నేతలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారు. ఇంట్లోని పనిమనుషుల్ని కూడా ఎత్తుకెళ్లడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి గూండాల చేతుల్లో పోలీసులు సైతం కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు, దౌర్జన్యాలకు తావులేదనే కనీస విజ్ఞత మరిచి వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతి ఒక్క దాడికి, ప్రతి ఒక్క ఘటనకు వడ్డీతో సహా మూల్యం చెల్లించించి తీరుతాం. జగన్ రెడ్డి మాఫియా డాన్లకు, రౌడీ షీట్లకు ఫుల్ క్లారిటీతో 70 ఎంఎం సినిమా త్రీడీలో చూపించి తీరుతామని అయన అన్నారు.

Related Posts