వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని మల్లారం రోడ్ లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో విషాదం జరిగింది. పట్టణంలోని అయ్యెరుపల్లి కి చెందిన రాజు అనే రైతు మామిడి పల్లి వెళ్లి తిరిగి వేములవాడ కి వస్తుండగా మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఒక కానిస్టేబుల్ వెళ్ళమనడంతో వెళ్తుండగా మరొక కానిస్టేబుల్ కర్ర విసిరి వేయడంతో రాజుకి గాయాలు. అయ్యాయి. రాజును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.