న్యూఢిల్లీ, మే 16
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది.