YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తీహర్ జైలులో ఎమ్మెల్సీ కవిత చాలా దైర్యంగా ఉన్నారు

తీహర్ జైలులో ఎమ్మెల్సీ కవిత చాలా దైర్యంగా ఉన్నారు

తీహర్ జైలులో ఎమ్మెల్సీ కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అయన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి జైలు లో కవితను పరామర్శించారు.  ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. లాయర్ కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిరంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్థం అవుతుంది. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, pmla ఎలా వర్తిస్తుంది? లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. వాళ్ళ పేర్లు, వీళ్లా పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటుందని అన్నారు.
బాల్క సుమన్ మాట్లాడుతూ కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఈరికించారు. న్యాయస్థానలపై నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నారు. బీజేపీ కి ఎవరు ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసు కేసే కాదు, అదొక పాలసీ... దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో బిఅరెస్, ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసే కుట్ర. లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి లాభమే జరిగింది. బీజేపీ వంటకాన్ని వండి....సీబీఐ, ఈడీ ని ఆప్, బిఅరెస్ మీదకి వదిలింది. ఇలాంటి కేసులతో మమ్మల్ని భయబ్రాంతులకు గురి అవుతామనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారు, కానీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. దేశంలో పాసిస్ట్ పాలన నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. బీజేపీ 220 సీట్లు దాటదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.
ప్రతిపక్ష పార్టీల నేతలను జైల్లో పెట్టి ప్రజాతీర్పును వారికి అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలకు ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పనున్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టిన తలవంచకుండా పోరాటం చేస్తాం. మొండిగానే పోరాడుతామని కవిత చెప్పారని అన్నారు.

Related Posts