రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. చందు త్రినయినితో పాటు పలు సీరియల్స్ లో నటించాడు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. తోటి నటి పవిత్ర ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం వున్నట్లు సమాచారం. చందు 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో చందు నటిస్తున్నాడు. పోలీసులు ఆత్మహత్య కు కారణాలు పై విచారణ చేస్తున్నారు.