ఘట్కేసర్
మేడ్చల్ జిల్లా. ఘట్కేసర్ మండలం. ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డు వ్యర్ధాలు. కలవడం తో వేల చేపలు మృత్యువాత పడ్డాయి. రెండు రోజుల నుంచి కురిసిన వర్షానికి రసాయన వ్యర్థలు కలవడం వల్ల ప్రతి యేటా ఇలాగే చేపలు చనిపోతున్నాయి. దీంతో దాదాపు 700 కుటుంబాలు ఈ చెరువు పై ఆధారపడి ఉన్నాయని, అలాగే రైతులు చెరువు నీళ్లపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు కాబట్టి రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం స్పందించి గంగపుత్రలను రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఎదులాబాద్ గ్రామ ప్రజలు అందరితో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దగ్గర ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు....