YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

80 కోట్ల స్థలం కబ్జాకు యత్నం.... బోరబండ పీఎస్లో కేసు నమోదు.

80 కోట్ల స్థలం కబ్జాకు యత్నం....  బోరబండ పీఎస్లో కేసు నమోదు.

హైదరాబాద్
ఎర్రగడ్డ డివిజన్లోని బోరబండ ప్రాంతంలో  ఉండే సారధి నగర్ లో ఎకరా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆదివారం కె. కుషాల్ రాజ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. స్థానిక ప్రజలు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కుశాల్ రాజ్ మియాపూర్ నివాసి ఆయన  త్రిలింగ  బయో క్యూర్  అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నాడు. బోరబండ లోని విజేత థియేటర్ ఎదురుగా ఉండే ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ ను కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలను సృష్టించాడు.  సుమారు రూ.80 కోట్ల విలువచేసే స్థలాన్ని కబ్జా చేయాలని చుట్టూ ఫెన్సింగ్ వేస్తుండగా స్థానికులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు సారధి సొసైటీ లో ఉన్న ఆ స్థలానికి చేరుకుని కుశాల్ రాజ్ దగ్గర ఉన్న భూమి పత్రాలను పరిశీలించి నకిలీ పత్రాలుగా కనుగొన్నారు. అనంతరం రెవిన్యూ అధికారులు బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కుషాల్ రాజ్ పై 447,427, ఐపీసీ మరియు 156 (3) సి ఆర్ పి సి కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్థలాలను, ఆయా స్థలాలలో ఉండే ప్రభుత్వ సూచిక బోర్డులను ఎవరైనా తొలగించి కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.

Related Posts