కూకట్ పల్లి
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ స్థానిక నాయకులతో కలసి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ ర హే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ కార్యకర్తలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ ఆద్యుడు అన్నారు దేశ సమగ్రత సామెక్యతలను కాపాడటం కోసం రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ తమ ప్రాణాలనే ఫణంగా పెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు సత్యం శ్రీరంగం గాలి బాలాజీ నాగిరెడ్డి తూము వేణు సతీష్ రెడ్డి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ప్రవీణ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.