YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరమలైనగర్‌ సమీపంలో సిగ్నల్‌ లోపం

మరమలైనగర్‌ సమీపంలో సిగ్నల్‌  లోపం

చెన్నై మే 21
చెంగల్పట్టు జిల్లా మరమలైనగర్‌ సమీపంలో ఒకే ట్రాక్‌పై నాలుగు సబర్బన్‌ రైళ్లు ఒకదాని వెనుక ఒకటి అతి దగ్గరగా ఆగిన సంఘటన కలకలం రేపింది. సాంకేతిక లోపం కారణంగా సిగ్నల్‌ పనిచేయకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని రైల్వే భద్రతా విభాగం అధికారులు తెలిపారు. రాజధాని నగరం చెన్నై నుంచి పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాలకు ప్రతిరోజు నడుపుతున్న సబర్బన్‌ రైళ్లలో వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు. చెన్నై బీచ్‌-తాంబరం-చెంగల్పట్టు మధ్య నాలుగు రైలు మార్గాలున్నాయి. వీటిలో రెండు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మిగతా రెండు మార్గాల్లో సబర్బన్‌ రైళ్లు నడుపుతున్నారు.

Related Posts