హైదరాబాద్
నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రత్నదీప్ సూపర్ మార్కెట్లో నాసిరకం చాక్లెట్లు లభ్యం అయ్యాయి. జంబో కింగ్ బర్గర్లో క్వాలిటీ లేని పిజ్జాలు సీజ్ చేసారు. కామత్ హోటల్లో సీలేని టీ పౌడర్ గుర్తించారు. షా గౌస్ లో నాసిరకంగా వంటకాల తయారీ, కిచెన్ లో అపరిశుభ్రత, బొద్దింకలను గుర్తించారు. నెల రోజులుగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. శాంపిల్స్ రిపోర్ట్స్ ఆధారంగా హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. దాదాపు 29 శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా గుర్తించామని అధికారులు వెల్లడించారు.