YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతుల ధర్నా సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం

రైతుల ధర్నా సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం

సూర్యాపేట
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున రైతులు  ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం  చేసారు. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు. బోనస్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతుండు . మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్నధాన్యానికే అంటూ  రైతులను మోసం చేస్తుండు. సన్న రకం ధాన్యం మార్కెట్కు రాదు అది ఎక్కువగా మిల్లులలోనే అమ్ముడు పోతుంది. నేల స్వభావాన్ని బట్టి నల్లరేగడి నేలల్లో ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారు.. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమనడం సరికాదని అన్నారు.
కెసిఆర్ రైతులను నెత్తిన పెట్టుకొని చూసుకుండు కరెంట్ ఇచ్చిండు కాలేశ్వరం నీళ్లు ఇచ్చిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేశ్వరం నీళ్లు ఇవ్వలేదు కరెంటు సరిగా ఇవ్వడం లేదు రైతుబంధు కూడా పంట చివర్లో ఇస్తున్నాడు . మా పంటలు ఎండిపోయాయి పండిన కొద్ది పంట అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెంటు కోతలు లేకుండా చూడాలి, కాలేశ్వరం నీళ్లు ఇవ్వాలి .. పంట మొదట్లోనే రైతుబంధు ఇచ్చి రైతు రుణమాఫీని వెంటనే చేయాలి. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తమని హెచ్చరించారు.

Related Posts