తిరుపతి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గమున తిరుమలకు బయలుదేరి వెళ్లారు.