YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ మైండ్ గేమ్... గులాబీ చిక్కేనా

కాంగ్రెస్ మైండ్ గేమ్... గులాబీ చిక్కేనా

హైదరాబాద్, మే 25
రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థుల్ని మానసికంగా బలహీనం చేయడం కూడా కీలకం. కొత్త తరహా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రత్యర్థుల్ని ఆవేశపడేలా చేసి తప్పులు చేసే ప్రోత్సహించడం అనే రాజకీయ వ్యూహం చాలా కాలంగా పార్టీల నేతలు అమలు చేస్తున్నారు. ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా స్థిమితంగా ఉన్న  రాజకీయ నాయకుడే కాస్త ఆలస్యమైనా అధికారాన్ని అందుకుంటారు. ఆవేశ  పడటమో లేకపోతే తన స్థాయి ఎంతో అని ఊహించుకుని బిగబట్టుకుని ఉండటమో చేస్తే రాజకీయంగా విఫలమవుతూ ఉంటారు. అధికారం పోతే ప్రతిపక్ష నేతలకు కనీస గౌరవం దక్కదు.. దానికి తగ్గట్లుగానే రాజకీయం చేయాలి. తాము ఒకప్పుడు శాసించామంటే.. కుదరదు. ఇలాంటి రాజకీయ పరిస్థితులతో మైండ్ గేమ్ ఆడేందుకు.. మానసికంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టేందుకు నేతలు వాడుకుంటున్నరు. ఏపీలో ఇప్పటి వరకూ అలాంటి రాజకీయం జరిగింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే రాజకీయం జరుగుతోందని.. కానీ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ను మానసికంగా బలహీనం చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ను ఆహ్వానించాలని రేవంత్‌రెడ్డి  నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  మాజీ ముఖ్యమంత్రి,  ప్రతిపక్షనేత కూడా  కావడంతో  ప్రోటోకాల్‌ ప్రకారం ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.  జూన్‌ 2న జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ హాజరవుతున్నారు. ఇదే  వేదికపై కేసీఆర్‌కు సన్మానం కూడా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో చాలా మందికి సన్మానం చేస్తామని ఇప్పటి వరకూ కేసీఆర్ ఉంటారు. ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం కేసీఆర్ కే వస్తే ఎలా ఉంటుంది. అది గౌరవం కన్నా ఎక్కువగా అవమానం అని ఫీలయ్యే అవకాశాల ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఆహ్వాన్ని కేసీఆర్‌కు పంపబోతోంది.  అయితే ప్రభుత్వ వెర్షన్ మాత్రం వేరేగా ఉంది.   ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే తెలంగాణ సాధనలో ఓ వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానం చేయడం అంటే ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమేనని బీఆర్ఎస్ భావించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ బాపుగా కేసీఆర్ కు కీర్తిని బీఆర్ఎస్ ఇప్పటికే ఇచ్చింది. ఆ విధంగానే పిలుస్తున్నారు కూడా. తెలంగాణను సోనియా ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతారు. కానీ  తెలంగాణను సోనియా ఇవ్వలేదని కేసీఆర్ గుంజుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటారు. అసలు తెలంగాణ జాతిపితను ఇలా తక్కువ చేసేందుకే సన్మానం పేరుతో ఆహ్వానిస్తున్నారని బీఆర్ఎస్ అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ కు అధికారిక ఆహ్వానం అందిన తర్వాత బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంది. తెలంగాణ తల్లిగా సోనియాను కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది. సోనియా ఇవ్వకపోతే అసలు తెలంగాణ వచ్చేది కాదని మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ ప్రాధాన్యాన్ని తక్కువ చేసి.. సోనియాను హైలెట్ చేసేందుకే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ధూంధాంగా నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా భావించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహం చూస్తే .. తెలంగాణ క్రెడిట్ ను కేసీఆర్ కు దూరం చేసే వ్యూహమని సులువుగానే అర్థమవుతుంది. అదే సమయంలో.. కేసీఆర్ ను మానసికంగా ఇబ్బందిపెట్టే వ్యూహమని భావిస్తున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ అనే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలాంటిది గుర్తుకు  రాకుండా సోనియాను హైలెట్ చేస్తున్నారని.. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా అందుకేనని అనుకుంటున్నారు. తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టాననని చెప్పే కేసీఆర్ కు ఈ పరిణామాలు ఇబ్బంది పెట్టేవే. అదే సమయంలో రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఏ మాత్రం సదభిప్రాయం లేదు. ఆయనను లిల్లీ పుట్ లీడర్ గా చాలా సార్లు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అభినందనలు కూడా తెలియచేయలేదు. కనీసం రేవంత్ రెడ్డి అనే పేరును కూడా ఆయన నోటి నుంచి వచ్చిన సందర్భాలు తక్కువే. అలాంటి నేత నుంచి సన్మానం పొందాలనే ఆలోచనే కేసీఆర్ ను  ఆవేదనకు గురి చేస్తుందని  బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఇలాంటి ఎఫెక్ట్‌నే కోరుకుంటోంది. కేసీఆర్ ను మానసికంగా ఎంత బలహీనం చేస్తే.. ఆయన రాజకీయంగా అంత  బలహీనపడతారని.. అనుకుంటున్నారు.  రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తాను రేవంత్ కంటే ఎంతో ఉన్నతుడినని అనుకుంటున్నారని..దానికి తగ్గట్లుగానే ఎప్పుడు అవకాశం వచ్చినా కేసీఆర్ కు తన హోదాను గుర్తు  చేసే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  కాలి తుంటి విరిగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఇది ఓ రకమైన రివెంజ్ అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు చేశారు.  ఇప్పటి వరకు కేసీఆర్‌-రేవంత్‌ ముఖాముఖి ఎదురుపడిన సందర్భాలు లేవు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా హాజరుకావడం పరస్పర గౌరవానికి సంబంధించిన అంశమనీ, దానిలో భాగంగానే ప్రధాని మోడీ నిర్వహించిన అధికారిక సభకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారని కేసీఆర్ కూడా రావాలని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తూ కేసీఆర్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ సాధన లో కేసీఆర్ పాత్ర పరిమితమేనని చెప్పేందుకు .. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సోనియా ముందుకు తెస్తున్నారన్నది బహిరంగరహస్యం. అదే సమయంలో చాలా వరకూ  కేసీఆర్ ఆనవాళ్లను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఎస్ స్థానంలో టీజీగా మార్చేశారు. జిల్లాల పునర్వవ్యవస్థీకరణ కూడా చెపట్టబోతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో కేసీఆర్ ముద్ర ఉండే వాటిని తప్పించే అవకాశం ఉంది. ఇదంతా కేసీఆర్ పై మానసిక రాజకీయంలో పైచేయి కోసం చేస్తున్న ప్రయత్నాలే అనుకోవచ్చు. కేసీఆర్ , బీఆర్ఎస్ రేవంత్ ప్రయత్నాలు ఎలా తిప్పికొడతారన్నది కీలకం. రేవంత్ ది పైచేయి అయితే మానసికంగా బలహీనపడితే అది బీఆర్ఎస్ క్యాడర్ లో స్థైర్యాన్ని మరింత తగ్గించే ప్రమాదం ఉంటుంది.
 

Related Posts