YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు

అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు

కుత్బుల్లాపూర్
భౌరం పెట్ లో వ్యవసాయ భూమిని అమ్మనందుకు కిరాయి గుండాలతో తమ పై దాడి కి యత్నిస్తున్నారని రెండు రోజుల క్రితం దుండిగల్ పోలీస్ స్టేషన్ వెళ్లిన రైతుల ఘటన మరవకముందే, రైతులకు మరో సమస్య వచ్చి పడింది. తమ పైనే కేసులు పెట్టేందుకు వెళ్తారా అని త్రిపుర భవన నిర్మాణ సంస్థ మరియు కొందరు బి అర్ ఎస్ నాయకులు కలిసి అదే రైతుల పై అక్రమ కేసులు బనాయించి జైలు కు పంపుతున్నారని అవేదన వ్యక్తం చేశారు రైతుల కుటుంబ సభ్యులు..బౌరం పేట లోని తమ వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ గోడు ను విన్నవించుకున్నారు. బౌరం పెట్ గ్రామానికి చెందిన రైతులను ఏడేళ్ళు గా వేధిస్తున్నారని కోర్టు కార్యాలయాల చుట్టు తిరిగి తమ భూమి లో కి ఎవరు రావొద్దని ఆర్థర్ తెచ్చుకుంటే,అవేవీ పట్టించుకోకుండా హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సదరు భూమి యజమానులు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బౌరం పెట్  సర్వే నం.188,187,189లో గల 2ఎకరాల 32 గుంటల  స్థలం విషయంలో కృష్ణా రెడ్డి, కంసమ్మా  అనే రైతులకు త్రిపుర భవన నిర్మాణ సంస్థ కు మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వ్యవసాయ భూమిలోకి  వచ్చి పంట నాశనం చేయడమే కాకుండా ఎదురు తిరిగిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల భార్యాపిల్లలు.
తరతరాలు గా తాతల నుండి సంక్రమించిన తమ భూమి పై బి అర్ గల్లి లీడర్లు  కన్నేసి,త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ తో కలిసి వేధిస్తున్నారని...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల విషయంలో చొరవ చూపి ఇలాంటి గుండాలపై కఠిన చర్యలు తీసుకుని తమ కు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.త్రిపుర భవన నిర్మాణ సంస్థ తో కల్సి మేకల వెంకటేష్, పసుపులేటి సుధాకర్ అనే  బి అర్ ఎస్ నాయకులు  తమ పై వొత్తిడి తెస్తున్నానరని వారి చెర నుండి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

Related Posts