హైదరాబాద్ మే
సినిమా ఫోటోఅటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని పిసిసి ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో మంత్రి కోమటిరెడ్డి కలిసి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన ఎన్నారై లకు ఈ ఎన్నికల ఆవశ్యకతను వివరించడమే కాకుండా వారిని పిలిపించి వారితో ఓటు వేయించినట్లు ఆయన తెలిపారు.దేశం లో రానున్నది ఇందిరమ్మ పాలనని, 2024 లో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కాగలడన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దేశ విదేశాల్లో ఉన్న ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానన్నారు.