YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కూటమి కార్యకర్తలు జాగ్రత్తగా వుండాలి

కూటమి కార్యకర్తలు జాగ్రత్తగా వుండాలి

కాకినాడ
కూటమి అభ్యర్థి పంతం నానాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి విజయం తధ్యం. కాకినాడ రూరల్ లో ఇరవై వేల మెజారిటీతో గెలవబోతున్నాను. కాకినాడ జిల్లాను నేరచరిత్ర ఉన్న ప్రాంతంగా ఎన్నికల కమీషన్ గుర్తించి దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ గా తయారైంది. రేపు కౌంటింగ్ లో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. మా కార్యకర్తలు ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ ఏజెంట్లును డబ్బుతో కొనడానికి ప్రత్యర్థి పార్టీలు సిద్దంగా ఉన్నట్టు మాకు సమాచారం ఉంది.  జనసేన కార్యకర్తలు కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలు పాటించాలి. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ పై సంతకం పెట్టే వరకు అందరూ లోపలే ఉండాలి. ఈ రోజు నుండి ఇక్కడ పార్టీలు లేవు మనది NDA కూటమి. కాకినాడ రూరల్ లో ఇప్పటి వరకు కబ్జా చేసిన స్ధలాలు జూలై 4వ తేదీ లోపు ఎవరి స్ధలాలు వారికి ఇచ్చేయండి లేదంటే జూలై 4 తరువాత మేమే ఆ స్ధలాలను హక్కు దారులకు పంచేస్తామని అన్నారు.

Related Posts