YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రక్తమోడిన తెలంగాణ రహదారులు

రక్తమోడిన తెలంగాణ రహదారులు

సోమవారం ఉదయం తెలంగాణలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నలుగురు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ ఆగివున్న లారీనీ వెనుకనుంచి ఓ కారు అతి వేగంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళుతుండగా ఘటన జరిగింది. మృతులు బావా-మరదళ్లు సత్యనారాయణ, మాధురిగా గుర్తించారు. సత్యనారాయణ భార్య సౌజన్య తో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైవే బైపాస్ రోడ్ లో తెల్లవారుజామున జరిగింది. ఉల్లిపాయల  లోడ్ తో వెళ్తున్న లారీ నందిగామ సమీపం లో కి రాగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో  లారీ క్యాబిన్ లో   6 మంది ప్రయాణిస్తున్నారు. బోల్తా పడ్డ లారీ లో క్లీనర్ తో పాటు ఒక  మహిళా ప్రయాణికురాలినూ ఉలి  సంచులు పడడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. పోలీసులు క్రేన్ సహాయం తో సుమారు రెండుగంటలు శ్రమించి మృతదేహాలను బయటికి తీశారు. చనిపోయినవారు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు కి చెందిన వారుగా గుర్తించారు. 

Related Posts