YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెమాన్ తుఫాన్ ప్రభావం తో ఇళ్లల్లోకి దూసుకు వచ్చిన కెరటాలు.

రెమాన్ తుఫాన్ ప్రభావం తో ఇళ్లల్లోకి దూసుకు వచ్చిన కెరటాలు.

పిఠాపురం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రతీరంలో మూడు రోజులుగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి. ఆదివారం నామమాత్రంగా అధికారులు మూసివేసిన బీచ్ రోడ్డు సోమవారం తెల్లారేసరికి యధావిధిగా వదిలేయడంతో బీచ్ లో ప్రజలు ప్రయాణం కొనసాగించారు. దీంతో ఉప్పాడ కాకినాడ ప్రయాణించే ప్రయాణికులపై సముద్రం విరుచుకుపడడంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. సూరాడ పేట,,మాయా పట్నంలో గతంలో వేసిన జియో ట్యూబ్ గట్టు పూర్తిగా ధ్వంసం కావడంతో, సముద్రపు నీరు ఇళ్లలోకి చొచ్చుకు. వచ్చింది. తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకార గృహాలు ఆ రెండు గ్రామాల్లో సుమారుగా 10 ఇల్లు తాకిడికి ధ్వంసమయ్యాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ నివసిస్తూ ఉంటున్నామని, తమను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Related Posts