YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పిల్లలను విక్రయించే ముఠా అరెస్టు తరుణ్ జోషి, రాచకొండ సిపి

పిల్లలను విక్రయించే ముఠా అరెస్టు తరుణ్ జోషి, రాచకొండ సిపి

రాచకొండ
రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా పిల్లలని విక్రయించే ఈ ముఠా పట్టుబడింది. నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని రాచకొండ సీనీ తరుణ్ జోషి అన్నారు.  వీరంతా పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది.ఇటీవల మేడిపల్లిలో శోభ రాణి, సలీం, స్వప్న లను అరెస్టు చేయడం జరిగింది. వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాము. 23 రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులని స్వాధీనం చేసుకున్నాము. మరింత లోతుగా  ఈ కేసుదర్యాప్తు  చేశాము. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకున్నాము. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశాము. ఢిల్లీ, పూణెల నుంచి  చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించాము. ఈ కేసులో మొత్తం 16మంది మంది చిన్నారులను రక్షించాము. ఢిల్లీ,పూణెలోఉన్నవారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ వెళ్ళిందని అయన అన్నారు.

Related Posts