YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పల్నాడులో కొత్త రోగం

పల్నాడులో కొత్త రోగం

గుంటూరు, మే 29,
ఇన్ని రోజులు ఎన్నికల ఘర్షణలతో అల్లాడిపోయిన పల్నాడు వాసులకు మరో కష్టం వచ్చి పడింది. ఎక్కడో ఉత్తరాదిలో అరుదుగా కనిపించే వ్యాధి ఇప్పుడు పల్నాడులో వెలుగులోకి రావడం అందర్నీ కలవర పెడుతోంది. అధికారులను, తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందీ రోగం ఇప్పుడు పల్నాడు పట్టిపీడిస్తున్న వ్యాధి సికిల్‌ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌. పంజాబ్‌లో మాత్రమే కనిపించే ఈ ఉరుదైన రోగం ఇప్పుడు పల్నాడు జిల్లాలోని ఇద్దరు చిన్నారులకు సోకింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో  జరిపిన పరీక్షల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడినట్టు సూపరింటెండెంట్‌ కిరణ్ తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు సమీపంలో ఉన్న తండాలోని చిన్నారులుకు సికిల్‌ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. ఎనీమియాతో బాధపడుతున్న చిన్నారులను ఈ మధ్య కాలంలోనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారికి గుంటూరు మెడికల్ కాలేజీలో పరీక్షలు చేస్తే సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ అనే వ్యాధి ఉన్నట్టు నిర్దారణ అయింది. ఈ వ్యాధి సోకిన వారికి రెడ్‌ బ్లడ్ సెల్స్‌  తగ్గిపోతాయని అన్నారు. ఎముక మజ్జ మార్చడమే దీనికి పరిష్కారమని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డ ప్రాంతంలోని అందరి చిన్నారులకు రక్త పరీక్షలు తప్పసరిగా చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు తాత్కాలికంగా రెడ్‌బ్లడ్‌ సెల్స్ ఎక్కించడంతో ఉపశమనం కలుగుతుందని కానీ... ఎముక మజ్జ మార్చడంతో పూర్తిగా నయం అవుతుందని అంటున్నారు. రాంపురం తండాలోని ఇద్దరూ చిన్నారులు రక్తహీనత (ఎనిమీయా)తో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధితో బాధపడేవారికి రక్త పరీక్షలు చేసి అవసరమైన మందులను వైద్యులు సూచిస్తారు. అయితే శ్రీరాంపురం తండాలోని పిల్లలిద్దరిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన ఫెధాలజీ విభాగం వైద్యులు అధునాతన వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో హీమోగ్లోబిన్ డి పంజాబ్ రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ వ్యాధి పంజాబ్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ చెప్పారుపల్నాడు జిల్లా రోగుల్లో హీమోగ్లోబిన్ డి తో పాటు సికిల్ హీమోగ్లోబిన్ కూడా కనిపించిందని ఈ రెండు వేరియంట్లు ఒకేసారి కనిపించడం అరుదుగా జరగుతుందన్నారు. వీటికి జిజిహెచ్ లో చికిత్స విధానం కూడా అందుబాటులో లేదన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్, స్టెమ్ సెల్ థెరపీ వంటి విధానాలతోనే చికిత్స చేయవచ్చారు. అత్యంత అరుదుగా కనిపించే వ్యాధి పల్నాడు ప్రాంతంలో బయటపడిందని అక్కడ ఉన్న చిన్నారులకీ వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పెథాలజీ వైద్యురాలు అపర్ణ తెలిపారు. రక్తహీనత ఉన్న రోగుల్లో హీమోగ్లోబిన్ ఐదు శాతం కంటే తగ్గిపోయి వివిధ సమస్యలు ఎదుర్కొంటారన్నారు.ఇలాంటి చికిత్స విధానం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేదని వైద్యులు వెల్లడించారు. సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ను హిమోగ్లోబిన్ D (Hb D) అని కూడా పిలుస్తారు. ఇది. ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్‌లాంటి దేశాల్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. మన దేశంలో మాత్రం వాయువ్య రాష్ట్రాల్లో చిన్నారులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వారు త్వరగా అలసిపోతారు. బలహీనంగా కనిపిస్తారు. తరచూ రోగాలు చుట్టుముడుతుంటాయి.

Related Posts