సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు సోమవారం శ్రావు సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్బంగా పలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తరువాత మంత్రి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాలలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో పేదోడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ధ్యేయమని అన్నారు. చిట్టాపూర్ గ్రామంలోఅంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం 60 డబుల్ బెడ్ రూములను ప్రారంభించారు. ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి కోరిక మేరకు మరో ఇరవై 20 డబుల్ బెడ్ రూములను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోమెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మదుపుల భూమిరెడ్డి, జడ్పిటిసి గౌతమి మహేష్, ఏఎంసి చైర్మన్ ఎల్లారెడ్డి రైతు సమన్వయ సమితి కమిటీ మెంబర్లు గ్రామ సర్పంచ్ పోతనక రాజయ్య వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.