YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోం

ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోం

న్యూఢిల్లీ, జూన్ 3
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీం నిరాకరించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సవాల్ చేసింది.

Related Posts