YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు

తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు

హైదరాబాద్  జూన్ 3
తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్‌లోకి వచ్చేది. కానీ ఇకపై వెస్ట్‌ గేట్‌ నుంచి లోపలికి వచ్చి నార్త్‌ ఈస్ట్‌ గేట్‌ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్‌ ఈస్ట్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్‌ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts