వనపర్తి జూన్ 3
బీఆర్ఎస్ పార్టీని వంద మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఏమీ చేయలేరన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి . కేసీఆర్ చేసిన అభివృద్ధిని చెరిపేయాలన్న కుట్రను ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. రాజకీయాలలో విష సంస్కృతిని తెచ్చిందే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి విజయం ప్రజస్వామ వ్యవస్థకు స్ఫూర్తి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా రాజకీయ ప్రలోభాలకు తెరతేసి అభ్యర్థిని నిలిపిన ఘనత రేవంత్ రెడ్డిదని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం, అంతమాత్రాన ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తాం, బొంద పెడతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నారు. 25 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, 14 ఏండ్ల పోరాట పటిమ, 10 ఏండ్లు అధికారంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్ది. ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టి హామీలు అమలు చేయాలని హితవు పలికారు.