YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రెట్టించిన ఉత్సాహంతో దీక్షలు విజయవంతం చేయాలి నవ నిర్మాణ దీక్ష 3వరోజు నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

రెట్టించిన ఉత్సాహంతో దీక్షలు విజయవంతం చేయాలి నవ నిర్మాణ దీక్ష 3వరోజు నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
‘‘నవ నిర్మాణ దీక్షలు 2రోజులు పూర్తయ్యింది, మిగిలిన 5రోజులు దీక్షలు మరింత స్ఫూర్తితో జరగాలి.రెట్టించిన ఉత్సాహంతో నవనిర్మాణ దీక్షలు విజయవంతం చేయాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.3వ రోజైన సోమవారం దీక్షల నిర్వహణపై తన నివాసం నుంచి అధికారులతో,ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
‘‘ప్రతిఒక్కరిలో నవనిర్మాణ స్ఫూర్తి ఉండాలి.మనలో పట్టుదల మరింత పెరగాలి.కసితో అభివృద్ధి వైపు సాగాలి.గ్రామానికి వెళ్లినప్పుడు పదిమందిని కలవాలి.గ్రామస్థులను చైతన్యపరచాలి.ప్రజల భాగస్వామ్యం పెంచే బాధ్యత సాధికారమిత్రలు తీసుకోవాలి.ఏ అంశంపై చర్చ ఉందో ఆ వర్గం ప్రజలను అధిక సంఖ్యలో భాగస్వాములను చేయాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రెండవ రోజు దీక్షలో 15.59లక్షల మంది భాగస్వామ్యం:
రెండవరోజు 15,59,846 మంది దీక్షలలో పాల్గొన్నారు.నోడల్ బృందాలు 12,226 పనులు పరిశీలించారు.గ్రామాలు,వార్డులలో 10,866 ప్రారంభోత్సవాలు జరిపారు. 25,358చోట్ల శంకుస్థాపనలు జరిపారు.దీక్షల సందర్భంగా 8,589చోట్ల నిర్దేశిత అంశంపై చర్చలు జరిపారు.రెండవరోజు 1,42,219మందికి పింఛన్లు అందజేశారు. 2,07,115మందికి కొత్తగా రేషన్ కార్డులు అందచేశారు.6,752 చోట్ల సాంస్కృతిక కార్యకలాపాలు జరిగాయి.6,046 ప్రాంతాలలో క్రీడల పోటీలు నిర్వహించారు.4,037 చోట్ల ఎగ్జిబిషన్లు నిర్వహించారు.
68చెరువులు నీటితో నింపడం సంతృప్తినిచ్చింది: 
ముఖ్యమంత్రి మాట్లాడుతూ,‘‘పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో చెరువులు నీళ్లులేక ఎండిపోయాయి. రూ.280కోట్లు ఖర్చుచేసి హంద్రీ-నీవా ద్వారా చెరువులను నీటితో నింపాం. నిన్న 68చెరువులను నీటితో నింపడం సంతృప్తిని ఇచ్చింది. 
మనం చేసిన పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి. వాటి ఫలితాలు అందరికీ కనబడుతున్నాయి.అందుకే ప్రజల్లో సంతృప్త స్థాయి 78% వచ్చింది.నవ నిర్మాణ దీక్షలతో సంతృప్తి మరింత పెరగాలి.నాలుగేళ్లలో చేసిన పనులు చెప్పండి.ప్రజల్లో మరింత సంతృప్తి పెంచండి’’ అని విజ్ఞప్తిచేశారు.
వారం రోజులు గ్రామాలలో ఉండటం అద్భుత అవకాశం:
‘‘దీక్షల సందర్భంగా ప్రతి శాఖాధిపతి గ్రామాలను సందర్శించాలి.క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలి.దీక్షల సందర్భంగా గ్రామాల్లో వారం రోజులు ఉంటున్నారు.ఇదొక అద్భుత అవకాశం,దీనిని సద్వినియోగం చేయాలి.గ్రామాలలో సమస్యలు అధ్యయనం చేయండి.సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించండి.మనం చరిత్ర సృష్టిస్తున్నామనేది గుర్తుంచుకోండి.కష్టపడటాన్ని ఒక ఫ్యాషన్ గా తీసుకోవాలి.ప్రభుత్వ పథకాల లబ్ది అర్హులకే చేరాలి.
కృష్ణా జిల్లాను ఒక నమూనాగా తీసుకోవాలి. జిల్లాలో లక్షమందిని సహజ సేద్యం వైపు మళ్లించారు.హర్యానా తరువాత రైతుల తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా ముందంజలో ఉంది.హర్యానా మించి కృష్ణా జిల్లా రైతాంగం తలసరి ఆదాయం పెరగాలి.ఇదే స్ఫూర్తితో మిగిలిన జిల్లాలలో కూడా రైతుల తలసరి ఆదాయం పెరగాలి.
కాలం ఎంతో విలువైనది,పోయిన కాలం మళ్లీ రాదు.కాలంతోపాటుగా మనం పరుగెత్తాలి.లక్ష్యాలను చేరుకోవాలి.సమస్యలు ఉన్నాయని ఆందోళన పడరాదు.సమస్యల పరిష్కారంలోనే మన సామర్ధ్యం పెరగాలి.ప్రజల భాగస్వామ్యంతోనే అద్భుత ఫలితాలు’’ సాధించగలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, రియల్ టైం గవర్నెన్స్ ఎండి అహ్మద్ బాబు,వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts