తాండూరు నియోజకవర్గంలో మంత్రి మహేందర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా అయన చెంగోల్ లో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రకారం చుట్టారు. రికార్డు స్థాయిలో ఐదుగురు మహనీయులు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్, చాకలి ఐలమ్మల విగ్రహాలను ఆవీష్కరించారు. తరువాత తెలంగాణ వాదుల భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణ సాధనకు బాటలు వేద్దాం. అంబేద్కర్ ఆశయ సాధనకు చిన్న రాష్ట్రాలు,జిల్లాల ఏర్పాటు చేశాం. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం, 24 గంటల విద్యుత్ సరఫరా, మద్దతు ధరలను అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మహిళా సంక్షేమం కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను, కేసీఆర్ కిట్లు, గర్బిణులకు,బాలెంతల కోసం కోట్లాది నిధులు అందిస్తున్నారు.