సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుత సంవత్సర రంజాన్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత సంవత్సరం మరింత ఘనంగా సికింద్రాబాద్ కు చెందిన ముస్లిం సోదర, సోదరిమణులు రంజాన్ వేడుకలను నిర్వహించుకొనేలా ఏర్పాట్లు జరుపుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాలు సమన్వయంగా వ్యవహరించి ముస్లింలు వేడుకగా రంజాన్ జరుపుకోనేలా ఏర్పాట్లను మంత్రి పద్మారావు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాగూడ మస్జిద్ , శ్రీనివాస్ నగర్ జామియా మస్జిద్, చిలకలగూడ బడీ మస్జిద్, బౌద్దనగర్ లోని అంబర్ నగర్ మస్జిద్ వంటి ఐదు మసీదుల్లో దుస్తులను మంత్రి పద్మారావు పంపిణి చేశారు. స్థానిక కార్పోరేటర్లు విజయ కుమారి, సామల హేమ లతో పాటు పలువురు మైనారిటీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్ కు చెందిన కనీసం 17 మసీదులకు సంబంధించి ఏకంగా ఎనిమిదిన్నర వేల మంది పేదలకు దుస్తులను ప్రభుత్వం ద్వారా కానుకగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రంజాన్ పండుగకు ముందీ అన్ని మసీదుల్లో దుస్తుల పంపిణీకి, ఇఫ్తార్ విందుల నిర్వహణకు ఏర్పాట్లు జరిపేలా అధికారులకు ఆదేశాలు జారి చేశారు.