YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రకృతి సంపదను కొల్లగోడుతున్న మట్టి మాఫీయాలు

ప్రకృతి సంపదను  కొల్లగోడుతున్న మట్టి మాఫీయాలు

గోదావరిఖని
పెద్దపల్లి జిల్లాలోని పలు చెరువుల్లోఅక్రమ మట్టి దందా జోరుగా సాగుతున్నదని,మట్టి మాఫియా మంథని, రామగుండంనియోజకవర్గాల్లోని చెరువులపై పడిందని, రాజకీయ అండదండలతో చెరువులను దక్కించుకున్న ఇటుక బట్టీల యజమానులు అనుమతులకు మించి మట్టి తీసిచెరువులనుకొల్ల గొడుతున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటి ఆద్యక్షులు.మద్దెల దినేష్. సోమవారంపెద్దపల్లి జిల్లా కలెక్టర్.కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయనమద్దెల దినేష్. మాట్లాడుతూఎక్కడికక్కడే సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని ముడుపులు ఆశపెట్టి దందాను యథేచ్ఛగా సాగిస్తున్నట్లు అనేకఆరోపణలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎలాంటి  వే బిల్లులులేకుండా చెరువుల నుంచినేరుగా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతూ మట్టిని తరలించుకుపోతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారిని మచ్చిక చేసుకుంటూ ఇటుక బట్టీల యజమానులు తమ వ్యాపారాన్ని, మట్టి దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగానడిపించు కుంటున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపేణా చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా పెద్దఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.జిల్లాలో 160కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయని.జిల్లాలోకేంద్రంలోని పెద్దపల్లి,రాఘవాపూర్‌, రంగంపల్లి,రామగిరి, కమాన్‌పూర్‌,రామగుండం, ధర్మారం,సుల్తానాబాద్‌, కాట్నపల్లి,తదితర ప్రాంతాల్లో 160కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయన్నారు.ఈబట్టీల ద్వారాప్రతిఏటా కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నదని,ఇక్కడి నుంచి హైదరాబాద్‌,వరంగల్‌, మంచిర్యాల,తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఇటుక సరఫరాఅవుతూ ఉంటుందన్నారు.ఇటుక తయారీకి అవసరమయ్యే చెరువుల్లో లభించే నల్ల రేగడి మట్టిని ప్రతి ఏటా వేసవి కాలంలో రాజకీయ పార్టీల అండదండలతో తరలించుకు పోతున్నారు.ఇటుక బట్టీల యజమానుల పేరిట గానీ, ఇతరుల పేరిట గాని అనుమతులు తీసుకుని కొంత మొత్తంలో రాయల్టీ, సీనరేజీ చెల్లించి పెద్ద ఎత్తున మట్టిని తరలించుకుపోతున్నారన్నారు. ఇటుక బట్టీల యజమానులు కొందరుతమకు అవసరమయ్యే మట్టిని తీసుకోవడంతో పాటు ఇతరులకు మట్టిని అమ్ముకుని లక్షలాధి రూపాయలు ఆర్జిస్తున్నారు. గౌరెడ్డిపేటకు చెందిన ఎన్‌బీసీ ఇటుక బట్టీల యజమాని కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి చెరువులో మట్టితరలింపునకు అనుమతులు తీసుకున్నారని, మొదట 6 వేలు,ఆ తర్వాత 2 వేల టన్నుల మట్టి తరలింపునకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించారు. కానీ రాత్రింభవళ్లు అనేక లారీల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండా 15 వేల టన్నులకు పైగా మట్టిని తరలించారన్నారు. అలాగే రామగుండం మండలం అల్లూరు చెరువు మట్టిని తరలించుకునేందుకు మియాపూర్‌కు చెందిన ఒకరు అనుమతులు తీసుకుని 2 నుంచి 4 వేల టన్నులకు రాయల్టీ చెల్లించి అడ్డగోలుగా మట్టిని తరలించారన్నారు.   
ఈ రెండు చెరువుల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను ఆయా గ్రామాల ప్రజలుసంబంధితఅధికారులకు పట్టించినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేవు. మంథనిమండలంలోనిబిట్టు పల్లిచెరువులోమట్టితవ్వకాల కోసంఅనుమతులుపొందగా, గ్రామస్తులఫిర్యాదుతోఅనుమతులను రద్దు చేశారు.
ఆ తర్వాత వారం రోజులకు మళ్లీ అనుమతులు ఇచ్చారు.10 వేల టన్నుల మట్టి కోసం రాయల్టీచెల్లించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.
ముర్మూరు.చెరువుపై కన్నువేశారు,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోనీళ్లుఅడుగంటడంతో ముంపునకు గురైన ముర్మూరు గ్రామంతో పాటు చెరువు తేలింది.దీంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. అనుకున్నదే తడవుగా 60 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి కోసం పెద్దపల్లి మండలంలోగల ఏఎస్‌ఆర్‌ బ్రిక్స్‌ యజమాని ఏ శ్రీనివాస్‌, ఎస్‌హెచ్‌ఆర్‌ బ్రిక్స్‌ యజమాని ఏ సౌందర్య పేరిట అనుమతులు పొందారు. విడతల వారీగా ఏఎస్‌ఆర్‌ 14,500, ఎస్‌హెచ్‌ఆర్‌ 15,500 మెట్రిక్‌ టన్నుల మట్టికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించారు. ఈ చెరువులో పది భారీ ఎక్స్‌కవేటర్లు, ప్రొక్లెయిన్లు, 50కి పైగా లారీలను పెట్టి చెరువు నుంచి ఒక్కో లారీలో 30 నుంచి 40 టన్నులకు పైగా మట్టిని చెరువుకు సమీపంలోగల ప్రభుత్వ స్థలంలో డంప్‌ చేస్తున్నారు. ఆ మట్టి పరిమాణం తెలియకుండా ఉండేందుకు పది వరకు బ్లేడ్‌ ట్రాక్టర్లు పెట్టి నేర్పించి తొక్కిస్తున్నారు. ఎవరన్న అధికారులు వచ్చిన ఆ డంప్‌నుతనిఖీచేసినాకూడా కొలతలకు దొరకుండా ఉండేందుకు మట్టిని నేర్పుతున్నారు.మట్టి తవ్వకాలపై సంబంధిత నీటి పారుదలశాఖాధికారుల పర్యవేక్షణకరువయ్యిందన్నారువాస్తవానికి నీటి పారుదల శాఖాధికారులు ఆయా చెరువుల్లో ఎంత లోతు పరిమాణంలో మట్టి తీసుకోవాలో పరిశీలించి అనుమతి ఇవ్వాలి. గనులు, భూగర్భ శాఖకు రాయల్టీ చెల్లించిన తర్వాత వే బిల్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలను పక్కన పెట్టి మొత్తం బాధ్యతను కేవలం నీటి పారుదల శాఖకు మాత్రమే అప్పగించారు. దీంతో సదరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వాహనాలు వెళుతున్నా కూడా రవాణా శాఖాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులకు ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నారు. ఆయా గ్రామాల ప్రజలు మట్టి లారీలను పట్టుకుని అధికారులకు అప్పగించినా కూడా కేసులు నమోదు చేయడం లేదు. పెద్దపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో రాత్రివేళల్లో అక్రమంగా కొందరు ఇటుక బట్టీల యజమానులు తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై కలెక్టర్‌ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారన్నారు.
ముఖ్యంగా ఇటుకబట్టిల యాజమాన్యాల పై టాస్క్ ఫోర్స్ దాడులు చేసి వారిని కఠినంగా శిక్షించాలి. ప్రకృతి సంపదను కొల్లకొడుతున్న వారి పై పిడి యాక్ట్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆయన కోరారు.

Related Posts