హైదరాబాద్
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందినందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డిని, ఖమ్మం వరం గల్, నల్గొండ పట్టబదుల నియోజకవర్గం నుండి గెలుపొందినందుకు తీన్మార్ మల్లన్న ను ఈ సందర్భంగా మంత్రివర్యులు అభినందించారు. వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.