YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన

కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన

అమరావతి జూన్ 11
కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29 ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభ పక్ష సమావేశం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బలపరిచారు. 95 నాటి పరిణామాలను మరోసారి టీడీపీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు.

Related Posts