ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి భారత సుదర్శన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. కొఠారీ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. విద్యా సామర్థ్యాలను అందుచే ప్రక్రియను పర్యవేక్షించడానికి స్వయం ప్రతిపత్తి గల విద్యా కమీషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ జానీ, కార్యాలయ ఇంఛార్జి మధుసూధన్, నాయకులు రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.