భువనగిరి
తెలంగాణలో బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 700కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 3,000లకు పైగా ఉంది ఉపాధ్యాయులు విధులకు హాజరు అవుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9:15 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. బడి గంట మోగడంతో విద్యార్థులు పాఠశాలకు పయనమయ్యారు. విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు మోడల్ స్కూలు 11 కస్తూరిబా పాఠశాలలు ఉన్నాయి.