YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అట్టాహాసంగా ప్రమాణం చెమర్చిన చంద్రబాబు కళ్లు

అట్టాహాసంగా ప్రమాణం చెమర్చిన చంద్రబాబు కళ్లు

విజయవాడ, జూన్ 12
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో, జేపీ నడ్డా, ఇతర రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిరథ మహారథులు కదలివచ్చిన వేళ ప్రమాణస్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అభిమానులు, కార్యకర్తల కేరింతలు, హోరెత్తిన చప్పట్ల మధ్య.. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు.. “నారా చంద్రబాబు నాయుడు అనే నేను..” అంటూ ఆయన ప్రమాణం మొదలెట్టగానే సభా ప్రాంగణమంతా జయజయధ్వానాలతో హోరెత్తిపోయింది. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్డీయే నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబులో ఉద్వేగం చాలా స్పష్టంగా కనిపించింది. బాబు వెన్నుతడుతూ మోదీ ప్రశంసాపూర్వకంగా చెప్పిన మాటలకు.. ఆయన కళ్లు చెమర్చాయి. ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. మోదీకి ధన్యవాదాలు చెప్పి చంద్రబాబు తిరిగి తన స్థానానాకి వెళ్లే వరకూ వేదికపై ఓ అపూర్వ సన్నివేశం కనిపించింది.

Related Posts