YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెల్లివిరిసిన ఆత్మీయ అనుబంధాలు

వెల్లివిరిసిన ఆత్మీయ అనుబంధాలు

విజయవాడ, జూన్ 12,
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే వేదికపై ఆత్మీయ అనుభందాలు వెల్లివిరిశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని అప్యాయంగా పలకరించారు తమ్ముడు నందమూరి బాలకృష్ణ. అందరూ చూస్తుండగా చెల్లిని పలకరిస్తూ తలపై నిమురుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు బాలయ్య. దీనికి ప్రతీకగా భువనేశ్వరి కూడా నవ్వుతూ పలకరించారు. దీంతో ఇరువురి మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని బాలయ్య అంతాతానై, అన్నీ తానై నడిపించినట్లు కనిపిస్తుంది. ముందుగా చిరంజీవిని కూడా సాదరస్వాగతం పలుకుతూ ఆలింగనం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు.ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు వేదికపైకి హాజరయ్యారు. వారిని గ్రాండ్ వెల్కం లభించింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణస్వీకారం చేశారు చంద్రబాబు. ఇలా ఆప్యాయత, ఆనురాగాలు, ఆనందాల మధ్య చంద్రబాబు ప్రమాణస్వీకారపర్వం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖ నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వేదిక మొత్తం ఒక్కసారిగా ఆనందోత్సాహాలు, అభిమానుల కేరింతలమధ్య సంబరంగా సాగింది. అటు నారా, ఇటు నందమూరి ఇంట్లనే కాకుండా ఆంధ్రరాష్ట్ర మంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది.

Related Posts