సూర్యాపేట
విద్యుత్ కొనుగోళ్ళు, కాళేశ్వరం ప్రోజెక్టుల విచారణపై మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది..? కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర ఉంది. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తాం. కమీషన్ల విచారణ పేరుతో రైతు రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు