YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి సేవలో చంద్రబాబు

శ్రీవారి సేవలో చంద్రబాబు

తిరుమల, జూన్ 13,
ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ అధికారులు  ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. వైకుంఠ క్యూకాంప్లెక్స్ వద్ద చంద్రబాబును చూసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Related Posts