YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బహిరంగ మలవిసర్జన రహితంతో పాటు మెరుగైన పారిశుద్ద్యమే లక్ష్యం జలమండలి ఎండీని అభినందించిన మంత్రి కేటీఆర్

బహిరంగ మలవిసర్జన రహితంతో పాటు మెరుగైన పారిశుద్ద్యమే లక్ష్యం  జలమండలి ఎండీని అభినందించిన మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రకటించిన ఓడిఎఫ్లతో సంతృప్తి చెందకుండా ఎడిఎఫ్ ఫ్లస్ గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను మారుస్తామని  రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి  తారక రామారావు గారు తెలిపారు. తేది. 04.06.2018, సోమవారం రోజున ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి నూతనంగా అందుబాటులోకి తీసుకురానున్న రోబోటిక్ సాంకేతికతను రాష్ట్ర ఎమ్ఎయూడీ ప్రిన్పిపల్ సెక్రెటరీ  అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ గారితో కలిసి మంత్రి తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మానవ రహిత పారిశుద్ద్య పనులు చేపట్టాలనే ఉద్దేశ్యంతో కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే నేడు మనుషులు దిగలేని, దిగకూడని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సాఫీగా సాగేలా రోజోటిక్ టెక్నాలజీని నేడు తిలకించినట్లు తెలిపారు. తద్వారా యంత్రాలే మ్యాన్హోళ్లలోకి దిగి సెవరెజీ పనులు చేపడుతాయని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం జలమండలి చేపట్టే నూతన ప్రాజెక్టు వ్యయంలో 0.25 శాతం సెస్ వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. వీటిని కార్మికుల సంక్షేమం కోసం, నూతన సాంకేతిక ఆవిష్కరణల కోసం వినియోగిస్తున్నట్లు వివరించారు. 
కేంద్ర ప్రకటించిన ఓడిఎఫ్లతో సంతృప్తి చెందకుండా ఎడిఎఫ్ ఫ్లస్ అనే వినూత్నమైన ఈ కార్యక్రమం ద్వారా బహిరంగ మలవిసర్జన రహిత నగరంతో పాటు మెరుగైన పారిశుద్ద్య పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యమనిఈ సందర్భంగా స్పష్టం చేశారు. మున్సిపల్ విభాగంలో నూతన సాంకేతిక వినియోగంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అలాగే నగరంలో కార్మికుల చేత మ్యాన్హోళ్లలోకి దిగి పారిశుద్ద్య పనులు చేపట్టకుండా జలమండలి  ఆధ్వర్యంలో 73 మినీ జెట్టింగ్ యంత్రాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. అలాగే జీహెచ్ఎఎంసీ సెవరెజీ పనులు చేపట్టే మరో 70 యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. మొత్తం 143కి తోడుగా అవసరమయితే ఇంకా యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈమిని జెట్టింగ్ యంత్రాల ద్వారా సెవరెజీ విభాగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని తెలిపారు. దేశ ప్రధాని కార్యాలయం నుంచి సైతం ఈ మినిజెట్టింగ్  యంత్రాలను అభినందించారని, ఈ యంత్రాల పనితీరును తెలుసుకుని దేశంలో మొత్తం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందన్నారు.
కొద్ది రోజుల క్రితం దురదృష్టవశాత్తు పైపులైనులోకి దిగి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడడం పట్ల మంత్రి విచారం వ్యక్తంచేశారు. సదరు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరించి కార్మికులను పైపులైనులోకి దించడం వల్ల  విష వాయువులు పీల్చి కార్మికులు మృతి చెందన్నారని తెలిపారు. ఆ కంపెనీపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Posts