YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంకా సీఎం కేసీఆరే…

ఇంకా సీఎం కేసీఆరే…

భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వకం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా ఇంకా ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఉన్నట్లుగానే బడిబాట కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాఠశాల గోడకి కట్టడమే కాకుండా ఊరంతా మరో ఫ్లెక్సీతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించటంతో ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులి గుండాల గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలో  అధికారంలో ఉన్న ప్రభుత్వమేంటో విద్యాశాఖ మంత్రెవరో, ముఖ్యమంత్రేవరో తెలియని ఈ టీచర్లు మా బిడ్డలకు ఏం చదువులు చెప్పి మా భవిష్యత్  మార్చుతారని ఇలాంటి టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Related Posts