శంషాబాద్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ కు వచ్చారు. కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ నుండి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ విఐపి గేట్ నుండి బయటకు వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. సెక్యూరిటీ అధికారులు బండి సంజయ్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.