YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పన్ను చెల్లింపుదారులకు... శుభవార్తే

పన్ను చెల్లింపుదారులకు... శుభవార్తే

న్యూఢిల్లీ, జూన్ 20,
ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జూలైలో లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు ఏడో బడ్జెట్. మోడీ 2.O వరకు ఆమె ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు.. ఒక మధ్యంతర బడ్జెట్ (5+1=6) ప్రవేశపెట్టారు. బడ్జెట్ కు మరో నెల ఉన్నందున, నిర్మలా సీతారామన్ ఈ సారి పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తారనే అంచనాలు, ఊహాగానాలు, ఆశలు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆమె తక్కువ పన్ను శ్లాబులతో కొత్త పన్ను విధానాన్ని ప్రకటించిన బడ్జెట్ 2020లో గణనీయమైన పన్ను టాక్స్ పేయర్స్ ను ప్రోత్సహించింది.ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక మంత్రి నుంచి శుభవార్త అందే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల ఆధారంగా రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా కొన్ని వర్గాల వ్యక్తులకు వ్యక్తి గత పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభిస్తుందని నివేదిక తెలిపింది.2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానంలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త విధానంలో రూ.15 లక్షల లోపు వార్షికాదాయంపై 5-20 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను ఉండబోతోంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షలకు ఐదు రెట్లు పెరిగినప్పుడు వ్యక్తి గత పన్ను రేటు ఆరు రెట్లు పెరుగుతుందని మరో మూలాన్ని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఆదాయపు పన్ను తగ్గింపు వల్ల వినియోగదారుల చేతుల్లో అదనపు నగదు వినియోగం పెరుగుతుంది. కొన్ని కేటగిరీలకు పన్నులు తగ్గించడం వల్ల మధ్య తరగతికి పొదుపు కూడా పెరుగుతుందని నివేదిక పేర్కొంది.2023-24లో ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, వినియోగం ఆ వేగంతో సంగ వరకు పెరిగిందని నివేదిక తెలిపింది.ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించేప్పుడు మధ్య తరగతి పొదుపును పెంచడం, వారి జీవితాలను మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పినందున పన్ను రేట్ల తగ్గింపుపై ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
2024 బడ్జెట్ లో పన్ను విషయంలో పరిశ్రమ అంచనాలు
పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా పేద వారికి ఆర్థిక మంత్రి సీతారామన్ కొన్ని పన్ను ఉపశమన చర్యలను ప్రకటిస్తారని ఇండియా ఇంక్ ఆశిస్తోంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున 2024-25 పూర్తి బడ్జెట్ లో తక్కువ శ్లాబులో ఉన్నవారికి ఆదాయపు పన్ను ఉపశమనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కొత్తగా ఎన్నికైన సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పురి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో, ఆర్థిక మంత్రి పన్ను రేట్లు లేదా శ్లాబుల్లో ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. కానీ ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు – ముఖ్యంగా వేతన జీవులు, మధ్య తరగతి – ఆమె కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నారు.

Related Posts