YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రుణమాఫీకి కసరత్తు

రుణమాఫీకి కసరత్తు

హైదరాబాద్, జూన్ 20,
రుణమాఫీ పథకం అమలు పై తెలంగాణ సర్కార్ కసరత్తు షురూ చేసింది. ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులో రుణమాపీ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా కార్యచరణ వేగవంతం చేసింది. ఓవైపు నిధుల సమీకరణ చేస్తూనే... మరోవైపు అర్హులను తేల్చే పనిలో పడింది. ఇప్పటికే దీనిపై అధికారులు ఓ కార్యచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు  21 రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. 21న జరిగే తెలంగాణ మంత్రిమండలి భేటీలో ముఖ్య అంశంగా రుణమాఫీ  ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎవరెవరికి రుణమాఫీ చేయాలి, నిధుల సమీకరణకు ఏం చేయాలనే విషయంపై కూలంకుశంగా చర్చించనున్నారు.  ప్రస్తుతం  ఇదే అంశంపై రేవంత్ సర్కార్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది.ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా చేయాలనే దానిపై అనేక మార్గాలను అన్వేషిస్తోంది. అధికారుల నుంచి పలు ప్రతిపాదనలను కూడా స్వీకరిస్తూ… మల్లగుల్లాలు పడుతోంది.  ఇచ్చిన హామీ ప్రకారం…. రుణమాఫీ ప్రక్రియను షురూ చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉందిఇటీవలే రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ ప్రక్రియ అమలు కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని కూడా చెప్పారు.ఇదిలా ఉంటే… రైతుల రుణమాఫీ విషయంలో కీలక ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా అర్హులు ఎవరు అనే దానిపై సర్కార్ దృష్టిపెట్టింది. ఈ విషయంలో లోతుగా కసరత్తు చేసి… అర్హత ఉన్నవారికి మాత్రమే స్కీమ్ ను వర్తింపచేయాలని భావిస్తోంది.పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. అధికారుల నుంచి వచ్చిన పలు ప్రతిపాదనల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకునే విషయంపై సర్కార్ ఆలోచించింది.రుణమాఫీ స్కీమ్ కు అర్హత పొందే లబ్ధిదారుడికి తప్పనిసరిగా పాస్ బుక్ ఉండటంతో పాటు రేషన్‌ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ఆలోచిస్తుందంట..!  దాదాపు రాష్ట్రంలో రుణమాఫీ స్కీమ్ కోసం 60 లక్షల మందికిపైగా రైతులు ఎదురుచూస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో చాలా మందికి పాస్ బుక్ లు లేవు. వీరికి వర్తింపజేయాలా లేదా అనేది కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.జులై17 రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. జులై నుంచే వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయని అప్పటి నుంచి రుణాలు మాఫీ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారట. జులై మధ్యలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి.. ఆగస్టు 15 కల్లా పూర్తి చేయనున్నారు. పీఎం కిసాన్‌ పథకంలో ఉన్న రూల్స్ ప్రకారమే మొత్తం మూడు విడతల్లో అప్పులు తీర్చేయనున్నారని టాక్. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించడం లేదు. ఇప్పుడు రుణమాఫీ కూడా వారి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ఇదే కాకుండా… రేషన్ కార్డును కూడా ప్రమాణికంగా తీసుకోవాలనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన పలువురికి రైతుబంధు వస్తుండగా… వారందరీకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేవు. కేవలం వారి కుటుంబ పెద్ద పేరు మీదనే కార్డు ఉంటోంది.  ఫలితంగా ఈ నిబంధను వర్తింపజేస్తే…. కుటుంబ పెద్ద మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేసే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఈ ప్రతిపాదన రాగా.. సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చూడాలి..ఇక ఆదాయపు పన్ను చెల్లించే వారిని పూర్తిగా పక్కనపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ మార్గదర్శకాలను  ప్రభుత్వం ప్రధానంగా పరిశీలిస్తోంది. ఈ స్కీమ్ లో కింద అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పన్నులు చెల్లించే వారికి వర్తించదు. కేవలం రైతులకు మాత్రం వర్తిస్తుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పలు పదవుల్లో ఉండే వారిని కూడా ఈ స్కీమ్ ను మినహాయించారు. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలు కూడా ఈ స్కీమ్ కు సంబంధించి ఉన్నాయి.

Related Posts