మహేశ్వరం
మహేశ్వరం మండలం లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు అందరికీ ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు 148 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఒక మహేశ్వరం మండలంలోని 123 మందికి తుక్కుగూడలో 25 మందికి నేడు పంపిణీ చేయడం జరిగిందని.
అదేవిధంగా మహేశ్వరం మండలంలోని ఇప్పటివరకు 2500 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎన్నికల కంటే ముందు ఒక హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్ష రూపాయలు దానితోపాటు తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు అట్టి హామీ అమల్లోకి తేలేదు కాబట్టి త్వరితగతిన అట్టి హామీని పూర్తి చేయవలసిన అవసరం ఎంతో ఉందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.