YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ తో ప్రత్యేక హోదా

కాంగ్రెస్ తో ప్రత్యేక హోదా
జైలుకి పోయి వచ్చిన అవినీతి పరులను ప్రజలు గెలిపించడం బాధాకరం తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు వీ హనుమంతరావు అన్నారు.ఈ రోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు ఆయన.అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు ఆలయ అధికారులు.స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.పవన్ కళ్యాణ్ గతంలో టీటీడీపీ,బిజెపిలతో పొత్తు పెట్టుకుని టీటీడీపీని ఏపీ లో గెలిపించారని నేడు ఎవరితో పొత్తు పెట్టుకొని అవినీతి నిర్ములాన చేస్తారో తెలపాలని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు రాజకీయ నాయకులు ఇచ్చే వాగ్దానాలను నిరవేర్చేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు ప్రస్తుతం ఎపార్టీని నమ్మడంలేదని, త్వరలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆయన అన్నారు

Related Posts