హైదరాబాద్
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు పాల్గొని పాల యోగాసనాలు వేశారు. యోగా గురువులు యోగా ప్రాముఖ్యతను వివరించి మెళకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మాట్లాడుతూ యోగాతో మానసిక ఉల్లాసం, శరీర దృఢ త్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ విధిగా యోగాను అలవాటూ చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య తెలంగాణ కోసం అన్ని సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు యోగా అలవాటు చేసే దిశగా, యోగ టీచర్లను నియమించినందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.