హైదరాబాద్
శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు.
పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతల అందోళన
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అయన కుమారుడు భాస్కర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేపధ్యంలో బీఆర్ఎస్ నేతలు బంజారా హిల్స్ లో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.వారిని పోచారం నివాసం లోపటికి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోచారం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండటంతో బీ అర్ ఎస్ లోపటికి అనుమతించలేదు.