మేడ్చల్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మండల కార్యాలయం ఆవరణలో ఎంపిపి P ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిబిరంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసారు.
యోగసాధన మనిషి మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి అని ఈటల అన్నారు.
ఈ కార్యక్రమం లో ఈటల లతో పాటు మేడ్చల్ మండల ఎంపిపి రజిత మల్లారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కొండం ఆంజనేయులు, రాజ మల్లారెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్గొన్నారు.