YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వానీకి అస్వస్థత- ఏయిమ్స్ ఆస్పత్రికి తరలింపు

బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వానీకి అస్వస్థత- ఏయిమ్స్ ఆస్పత్రికి తరలింపు

న్యూఢిల్లీ
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వానీ అస్వస్థతకు గురయ్యారు.  దాంతో అయనను బుధవారం రాత్రి హుటాహుటిన  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.  96ఏళ్ల ఆడ్వా నీ  కి యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆసుపత్రి అధికారులు,అద్వానీ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి అద్వానీ ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు.

Related Posts