తాండూరు
భారత పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తాండూర్ అంబేద్కర్ కూడలిలో ఒవైసీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్బంగా బిజెపి శ్రేణులు మాట్లాడుతూ భారత పార్లమెంటులో హైదరాబాద్ ఎంపీ ఆసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తిన అని అనడాన్ని భారతీయ వాదులు, జాతీయ వాదులు అందరు కలిసి ముక్తకంటం తో ఖండించాలని అన్నారు. భారత దేశంలో నివసిస్తూ సీనియర్ ఎంపీ గా ఉండి చాలా సంవత్సరాల నుండి పదవులను అనుభవిస్తూ జై పాలస్తీనా అనడం ఎంత వరకు సమంజసమని అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ని వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దుచేసి అనరుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.