YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇంకా ప్రజల వద్దే రూ.7581 కోట్లు

ఇంకా ప్రజల వద్దే రూ.7581 కోట్లు

ముంబై, జూలై 2,
చెలామణి నుంచి తొలగించిన రూ.2000 నోట్లలో 97.87 శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. అయితే రూ.7,581 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ తన డేటాలో వెల్లడించింది. 2023 మే 19న చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. జూన్ 28, 2024న వ్యాపారం ముగిసే సమయానికి రూ.7,581 కోట్లకు తగ్గిందిరూ.2000 నోట్లలో 97.87 శాతం జూన్ 28, 2024 నాటికి బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉంది. మే 19, 2023 నుండి, రూ. 2000 బ్యాంకు నోట్లను మార్చుకునే సదుపాయం కూడా రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.అక్టోబర్ 7, 2023 గడువు ముగిసిన తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఇష్యూ కార్యాలయాలు అక్టోబర్ 9, 2023 నుండి వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను వారి బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. ఇది కాకుండా, ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా ఆర్బీఐ ఏదైనా ఇష్యూ కార్యాలయానికి 2000 రూపాయల బ్యాంకు నోట్లను పంపవచ్చు.

Related Posts